Wednesday, July 31, 2019

కాపురాల్ని కూల్చుతున్న కొత్త సమస్య ఇగో .. ఇద్దరూ ఉద్యోగస్తులైతే..

కాపురాల్ని కూల్చుతున్న కొత్త సమస్య  ఇగో .. ఇద్దరూ ఉద్యోగస్తులైతే..
7/31/2019 10:36:22 AM 
ఇగోతో.. తెగుతున్న బంధాలు
ఆనందాల స్థానంలో ఘర్షణ వాతావరణం
ఎవరికి వారే తానేమీ తక్కువ కాదనే అహం
పెరుగుతున్న నెగిటివ్‌ ఆలోచనా ధోరణి
తగ్గిన సర్దుకునే గుణం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): ఇగో.. ఇది మనిషిలోని మానవత్వాన్ని మంటగలుపుతుంది. ఇది పట్టింపులు పెరిగి మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఆనందంగా సాగాల్సిన కాపురం కలహాల కాపురంగా మారుతుంది. ఎవరికి వారు తానేమీ తక్కువ కాదనే ధోరణితో వ్యవహరిస్తుండడంతో పట్టింపులు మరింత పెరుగుతాయి. ఈ మధ్య కాలంలో ఇది దంపతుల మధ్య దూరాన్ని పెంచి వారి కాపురాలను కూల్చేస్తోంది. ఇద్దరి మధ్య ఇగోలు చోటు చేసుకోవడానికి కొన్నిసార్లు సమాజ పరిస్థితులు కారణమవుతున్నాయి. ప్రధానంగా ఆర్థిక అంశాలే వీటిని పెంచి పోషిస్తున్నాయి. ఆర్థికంగా ఎదుగుతుండడంతో కొందరిలో ఇగోలు పెరుగుతున్నాయి.

దెబ్బతింటున్న అహం
ఒకే జనరేషన్‌లో ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటుండడంతో కింది దశలో ఉన్న వారిలో అహం దెబ్బతింటోంది. సమాజంలో ఇతరులు ఉన్నతులుగా ఉంటుండడం, తాము ఆ స్థాయికి ఎదగలేకపోవడం మనసుపై ప్రభావం చూపుతోంది. రెండు రకాల వ్యక్తులు ఒకచోట కలిస్తే మరొకరిలో ఇగో పెరుగుతుంది. తమను చిన్న చూపు చూస్తున్నారనే భావన వారిలో ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలో చిన్నమాట ఎవరైనా అంటే చాలు.. ఒక్కసారిగా రియాక్ట్‌ అవడం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.

నెగిటివ్‌ ఆలోచనలతోనే
చాలా మందికి నెగిటివ్‌ ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరైనా ఏమైనా అంటే దానిని నెగిటివ్‌గా ఆలోచించి వారిపై ఇగో పెంచుకుంటున్నారు. దీంతో ఇరువురి మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ తరహా అంశాలు భార్యాభర్తల మధ్య చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆర్థికంగా బాగా ఉన్న సమయంలో విలాసంగా బతికేవారి కుటుంబ పరిస్థితి తారుమరు అయితే తట్టుకోలేని పరిస్థితులకు చేరుతున్నారు. విలాసాలకు చెక్‌ పెడుతుండడంతో కుటుంబంలో తరచూ తగాదాలు ఏర్పడుతున్నాయి. అంత వరకు బాగా బతికిన కుటుంబం ఒక్కసారిగా చితికిపోవడంతో సమాజంలో తమకు స్టేటస్‌ తగ్గిందనే ఆత్మన్యూనతా భావం వారిలో ఏర్పడుతుంది. దీనికి కారణం నువ్వేనంటూ భార్యాభర్తలిద్దరూ పరస్పరం నిందించుకోవడం పరిపాటిగా మారింది. ఆ తర్వాత ఇది మరింత పెరిగి ఆత్మహత్యలకు దారి తీస్తోంది. తల్లిదండ్రులను ఎదురించి పెళ్లి చేసుకున్న కుటుంబాల్లో కూడా ఇరువురి మధ్య దూరం పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. పెళ్లి చేసుకుని మంచిగా బతకాలనే ఆశతో పెళ్లి చేసుకున్న దంపతులకు అనుకున్నట్లుగా పరిస్థితులు లేకపోవడంతో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని వైద్యులు తెలిపారు.

తగ్గిన కమ్యూనికేషన్‌
భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్‌ సైతం బాగా తగ్గిపోతోంది. ఇరువురు ఉద్యోగులు అయితే వారి మధ్య దూరం మరింత పెరిగి కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు కనిపించడం లేదు. అవసరమైతే పొడి పొడి మాటలు తప్ప, అన్యోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
ఒకే ఇంటిలో ఉన్పప్పటికీ ఎవరికి వారే ఉన్నట్లుగా ఉంటున్నారు. ఎక్కువగా ఫోన్లతోనే సవ్గుయం గడుపుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు.

ఇద్దరు పనిచేయడం..
భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తుండడంతో వారిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గతంలో పురుషుడు ఉద్యోగం చేసే వారు, భార్య ఇంటి విషయాలు చూసుకునేలా ఉండేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇరువురు ఉద్యోగం చేస్తుండడంతో భార్యను ఇంటి మనిషిగా చూస్తుండడంతో ఆమె తట్టుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. నేనూ సంపాదిస్తున్నానే ఇగో ఇద్దరిలో పెరిగి గొడవలకు దారి తీస్తోంది. ఒకవైపు ఆఫీసు పని, మరోవైపు ఇంటి పనులతో గృహిణి ఒత్తిడికి గురవుతోంది. అన్ని పనులు నేనే ఎందుకు చేయాలి.. ఆయన కూడా చేయొచ్చు కదా.. అనే భావన ఏర్పడి ఇగోతో గొడవలు పడుతున్నారు.

మాట్లాడుకునే సమయం లేక..: సుజాత రమణి, సైకాలజిస్టు, కిమ్స్‌ ఆస్పత్రి
భార్యాభర్తలు పూర్తిగా మాట్లాడుకోవడం లేదు. ఇద్దరి మధ్య అవినాభావ సంబంధాలు పెద్దగా ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా ఉన్నామా.. అంటే ఉన్నాం.. అనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకునే సమయం ఇద్దరి మధ్య ఉండడం లేదు. దీంతో పరిష్కారించుకోవాల్సిన సమస్యను పెద్దవి చేస్తుండడంతో ఘర్షణ పెరుగుతోంది. దీంతో ఇద్దరి మధ్య ఇగో అడ్డం వస్తోంది. భార్యాభర్తల మధ్య ఒత్తిడి పెరిగి ఇగోలతో రాజీకి రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది క్రమేణా మనస్పర్థలకు కారణమవుతోంది.

రియలైజేషన్‌ రావడం లేదు..:డాక్టర్‌ భరత్‌కుమార్‌, సైకియాట్రిస్టు, అపోలో ఆస్పత్రి
భార్యాభర్తల మధ్య ఏవైనా తగదాలు వస్తే రియలైజేషన్‌ వచ్చేది. ఒకరికొకరు తప్పు తెలుసుకుని సర్దుకుపోయే వారు. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితుల లేవు. వయస్సు పెరుగుతున్నప్పటికీ వారిలో రియలైజేషన్‌ రావడం లేదు. ఎవరికి వారు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది కాస్తా పెరిగి నేను తగ్గడం ఎందుకనే ఇగో పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఇగో పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్థం చేసుకోవాలి. సమస్యకు కారణాలు గుర్తించాలి. ఇద్దరి మధ్య ఇంటరాక్షన్‌ బాగా పెరగాలి.

Wednesday, July 10, 2019

International day of solidarity of journalists

International day of solidarity of journalists

8 SEPTEMBER

sunday
3.8/512345
Annually on the 8th of September is the international day of solidarity of the people of this profession, in memory of the Julius Fuchik, about famous Czech journalist who was killed in the Second World war.

Czech writer, leader of the anti-fascist movement, was executed by the Nazis on 8 September 1943 in Germany. His famous book is called "the Report with a noose around his neck", written in prison, with time, was published in 70 languages of the world.

On this day all over the world conferences, which writes the brethren shares his experience and receives awards for its sometimes quite unsafe work. The ceremony of awarding the Pulitzer prize (the most prestigious among American journalists), for example, are almost always held on 8 September.

The largest and oldest international journalist organization in the world is CAN the international organization of journalists established by representatives of 21 countries of anti-Hitler coalition on 8 June 1946. The main task of the organization has always been preserving peace and friendship through honest, truthful and free publicity. Uniting under its wing more than 400 thousand professionals from many countries of the world, we CAN accept into the ranks of the national journalists ' unions and individual members.

At one time the organization has been established by the international journalism award and the Honorary medal of the name of Julius Fucik, which are awarded to the best figures in the field of media for professional activities that promote the preservation of peace and the development of a spirit of cooperation and unity among journalists.

అవసరానికి తగ్గ కోర్సులే వుండాలి

అవసరానికి తగ్గ కోర్సులే వుండాలి
బడుల మూత

4000 బడుల మూత?
10-07-2019 03:30:48

3500 ప్రాథమిక పాఠశాలలు
500 ఉన్నత పాఠశాలలు
విద్యార్థులు, టీచర్లు ఇతర స్కూళ్లకు
టీఆర్టీ నియామకాలు కాగానే ప్రక్షాళన
విద్యార్థులు లేని బడులకు కోత
మూసివేతకు రాజస్థాన్‌ ఫార్ములా
సర్కారుకు నేడు అధికార్ల నివేదిక
త్వరలో టీచర్ల సంఘాలతో భేటీ
పదోన్నతుల తర్వాతే టీఆర్‌టీ నియామకాలు
పలు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌
హైదరాబాద్‌, జూలై 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 4 వేలకు పైగా ప్రభుత్వ బడులు మూతపడనున్నాయి. సరిపడా విద్యార్థులు లేని బడులను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాజస్థాన్‌ ఫార్ములాను అనుసరించనున్నారు. ఐదుగురు సభ్యుల అధికారుల బృందం ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని మూసివేశారు? ఏ అంశం ఆధారంగా మూసివేశారు? వంటి విషయాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. పూర్తి నివేధికను బుధవారం ప్రభుత్వానికి అందించనుంది. రాజస్థాన్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగేళ్లలో 20 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసినట్లు మన అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అమలు చేయనున్నారు. మూసివేసే బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లను ఇతర పాఠశాలలకు తరలిస్తారు. రోజూ దూరంగా ఉన్న పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌ మీద పంపిస్తారు.

ADVERTISEMENT


POWERED BY PLAYSTREAM


టీఆర్టీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత బడుల మూసివేతకు శ్రీకారం చుడతారు. ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 10 మంది విద్యార్థుల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల వివరాలను, 30 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలల వివరాలను అందించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు సమాచారాన్ని అందించగా, మరికొన్ని జిల్లాలు కసరత్తు చేస్తున్నాయి. బడుల మూసివేతకు ఓవైపు అంతర్గత చర్యలు చేపడుతూనే పైకి మాత్రం అలాంటిదేమీ లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పాఠశాల విద్యా కమిషనర్‌ను రాజస్థాన్‌ పర్యటనపై ఆరా తీయగా... త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్టీ నియామకాలు కూడా ఎక్కువ విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉన్న పాఠశాలల్లో మాత్రమే చేపట్టనున్నారు. దీంతో టీఆర్టీ నియామకాల తర్వాత బడుల రేషనలైజేషన్‌ చేసినాఇబ్బంది ఏమీ ఉండదని అధికారులు తెలిపారు. మూసివేతపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు.

4 వేల స్కూళ్లకు ముప్పు...
తెలంగాణలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 27.73 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడులను మూసివేయాలనే విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 4 వేల పాఠశాలలకు మూసివేత ముప్పు వాటిల్లనుంది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3500 వరకు ఉండగా, ఉన్నత పాఠశాలలు 500 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 కన్నా, ఉన్నత పాఠశాలల్లో 30 కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలపై వేటు పడనుంది. 2018-19 విద్యా సంవత్సరంలో 3445 ప్రాథమిక పాఠశాలల్లో, 22 ఉన్నత పాఠశాలల్లో 1-15 మంది విద్యారులున్నారు. 14138 ప్రాథమిక పాఠశాల్లో, 1397 ఉన్నత పాఠశాలల్లో 16-100 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసంగా 4వేల పాఠశాలలు మూతపడే అవకాశాలు కనిపించాయి. 2017-18 లెక్కల ప్రకారం 793 పాఠశాలల్లో విద్యార్థులే లేరు. వీటిలో 779 ప్రాథమిక పాఠశాలలు కాగా 11 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 1544 పాఠశాలల్లో 1-10 మంది విద్యార్థులున్నారు. వీటిలో వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1510 కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 30, ఉన్నత పాఠశాలలు 4 ఉన్నాయి. 3,252 పాఠశాలల్లో 11-20 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,13, ప్రాథమికోన్నత పాఠశాలలు 96, ఉన్నత పాఠశాలలు 22 ఉన్నాయి. వీటితో పాటు 3681 పాఠశాలల్లో 21-30 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3420, ప్రాథమికోన్నత పాఠశాలలు 217, ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి.


బడుల మూత మానుకోవాలి
మంత్రి జగదీశ్‌రెడ్డికి విద్యా పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం, ఉపాధ్యాయ ఖాళీలను తగ్గించే చర్యలను మానుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరింది. కమిటీ ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, ఇతర సమస్యల గురించి న్యాయమూర్తి, విద్యావేత్తలతో కమిటీ వేయాలని ప్రతినిధులు సూచించారు. పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, పిల్లలకు ఉదయం, సాయంత్రం అల్పాహారం ఇచ్చి...హోం వర్క్‌ని పాఠశాలలోనే చేయించాలని, ప్రైవేట్‌ బడులను నియంత్రించాలని కమిటీ ప్రతినిధులు మంత్రికి సూచించారు. దీనికి స్పందించిన జగదీశ్‌రెడ్డి ..తమ పరిధిలో చేయగలిగినవన్నీ యుద్ధ ప్రాతిపదికన చేస్తామని తెలిపారు. మూసివేతలపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఏ నిర్ణయమైనా ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో చర్చించిన తర్వాతే తీసుకుంటామన్నారు.

‘అమ్మఒడి’తో సర్కారీ బడుల మూత?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Published Tuesday, 25 June 2019
పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో రూ.15 వేలు జమచేసేలా ‘అమ్మఒడి’ పథకం అమలు చేస్తానని వైకాపా అధినేత జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన అనంతరం ఆ హామీని అమలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచన మేరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే పిల్లలందరికీ ‘అమ్మఒడి’ వర్తింపజేస్తామని అధికారులు ప్రకటించారు. పేదవర్గాల తల్లిదండ్రులకు ఇదొక వరమే. ఇది ప్రభుత్వానికి అదనపుభారం అని చాలామంది అనుకోవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.300- 400 కోట్ల వరకు నిధులు విడుదలవుతాయి. ఆ లెక్కలను సమగ్రంగా పరిశీలిస్తే ఏ ఒక్క జిల్లాలో కూడా పూర్తిస్థాయిలో పాఠశాలలకు గ్రాంట్లు వినియోగించిన దాఖలాలు లేవనే చెప్పవచ్చు. అలాంటప్పుడు ఆ నిధులను అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు వినియోగించుకునే అవకాశం లేకపోలేదని నిపుణుల అభిప్రాయం. అమ్మఒడి పథకాన్ని ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకూ వర్తింపజేయడం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాహక్కు చట్టప్రకారం దారిద్య్రరేఖకు దిగువన వున్న 25 శాతం విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుకోవాల్సి వుంది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ 25 శాతం మందికే ‘అమ్మఒడి’ని వర్తింపజేస్తే బాగుంటుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపే మధ్యతరగతి కుటుంబీకులైతే తాము చెల్లించే ఫీజులకు కొంత డబ్బు కలిసొస్తుందని ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గుచూపే అవకాశాలు లేకపోలేదు. పట్టణాలు, నగరాల్లో వున్న ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మఒడి ద్వారా అందే మొత్తం ఫీజులకు చాలకపోవచ్చు. గ్రామీణ స్థాయిల్లో ప్రైవేటు పాఠశాలల్లో ఏడాదికి రూ. 15వేలకే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివించే వారు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1700 కంటే ఎక్కువగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తగినంత మంది విద్యార్థులు లేక ఇప్పటికే చాలా పాఠశాలలు మూతపడి, లక్షలు విలువ చేసే భవనాలు నిరుపయోగంగా వున్నాయి. చాలా ప్రాంతాల్లో 10 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు లేకపోలేదు. అమ్మఒడి పథకం ద్వారా లభించే నగదు ప్రోత్సాహకాలతో గ్రామీణ ప్రాంతాల వారు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలల్లో చేర్చించే పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలు లేకపోలేదు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. అయితే, అమ్మఒడి పథకం వల్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతపడే అవకాశాలున్నందున ముఖ్యమంత్రి ఆశయం ఎలా నెరవేరుతుంది?


ఏపీలో 9,200 సర్కార్ బడుల మూత?

Wed,August 1, 2018 12:22 AM
9200 Sarkar boxes lid in AP
-హేతుబద్ధీకరణ పేరుతో స్కూళ్ల విలీనం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ఏపీలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధమవుతున్నది. ఈ ఏడాది దాదాపుగా 9,200 స్కూళ్లను మూసివేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నట్టు తెలిసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నదని, వాటిని పక్కనున్న ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. గత ఏడాది ఇదే కారణంతో దాదాపు 4 వేల స్కూళ్లను మూసేసింది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను గుర్తించే పనిని ఉపాధ్యాయులకు అప్పగించిన ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తివేసి ఉన్నతపాఠశాలల్లో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. గత ఏడాది విద్యార్థుల సంఖ్య 30 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేసిన ప్రభుత్వం ఈ ఏడాది 60 కంటే తక్కువగా ఉన్నవాటిసి మూసివేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. 60 కంటే తక్కువగా ఉన్న పాఠశాలలు ఏపీలో 17,690 ఉన్నట్టు విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తున్నది. విద్యాశాఖ నిర్ణయం ప్రకారమైతే ఈ పాఠశాలలన్నీ మూతపడే అవకాశాలున్నాయి.